News April 14, 2025
విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు.. కొత్త వివాదంలో TN గవర్నర్

తమిళనాడు గవర్నర్ R.N.రవిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మధురైలోని ఓ కళాశాల విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయించారు. మతాలకు అతీతమైన పదవిలో ఉండి ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని DMK, కాంగ్రెస్, CPI నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News April 21, 2025
మా పిల్లలు ఆలయాన్ని ఎంతో ఇష్టపడ్డారు: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీలోని అక్షర్ధామ్ మందిరాన్ని సందర్శించారు. ‘ఈ అద్భుత ప్రదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించిన ఘనత భారత్కు దక్కుతుంది. మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు’ అని టెంపుల్ విజిటర్ బుక్లో వాన్స్ రాశారు. కాగా US ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా 4 రోజులు భారత్లో పర్యటించనున్నారు.
News April 21, 2025
అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పిన రోహిత్

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
News April 21, 2025
IPL: టాస్ గెలిచిన కేకేఆర్

ఈడెన్ గార్డెన్స్లో KKRvsGT మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లో గుజరాత్(5 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా కోల్కతా(3 విజయాలు) ఏడో స్థానంలో ఉంది.
జట్లు:
GT: గిల్, సుదర్శన్, బట్లర్, రూధర్ఫోర్డ్, షారుఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్
KKR: గుర్బాజ్, నరైన్, రహానే, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్దీప్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్