News August 9, 2024
‘గుడ్ మార్నింగ్’ బదులు ‘జైహింద్’.. హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం

హరియాణా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి అన్ని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు ‘గుడ్ మార్నింగ్’కు బదులుగా ‘జై హింద్’ చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. స్వాతంత్య్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ జైహింద్ నినాదంతో ప్రజలను ఒక్కటి చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 18, 2026
ఏపీలో ప్రతిపక్షమేది?

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?
News April 18, 2026
డీలిమిటేషన్.. జాతీయ మీడియాలో రేవంత్ పేరు!

131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా సీఎంల కంటే ముందుగా రేవంతే ఈ అంశాన్ని లేవనెత్తారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్కు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని విమర్శించారు. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలని సరికొత్త పాయింట్ను తెరపైకి తెచ్చారు.
News April 18, 2026
పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’కు ఓటీటీ కష్టాలు?

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ‘స్లమ్ డాగ్’పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ముగిసినా రిలీజ్ ప్రకటన వెలువడటం లేదు. దీనికి ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. డీల్ పూర్తయ్యాకే విడుదల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


