News December 17, 2024
జమిలి బిల్లు: లోక్సభలో ఎవరి బలం ఎంత?

జమిలి ఎన్నికల బిల్లు నేపథ్యంలో లోక్సభలో పార్టీల బలాబలాలపై ఆసక్తి నెలకొంది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సంఖ్యాబలమే కీలకం. 543 స్థానాలున్న LSలో NDAకు 293 సీట్లు ఉన్నాయి. ఇందులో BJP 240, TDP 16, JDU 12, SS 7, LJP 5 పెద్దపార్టీలు. INDIAకు 249 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 99, SP 37, TMC 28, DMK 22 పెద్ద పార్టీలు. కూటమిని TMC పట్టించుకోవడం లేదు. ఇక తటస్థ పార్టీల వద్ద 11 సీట్లున్నాయి.
Similar News
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 5, 2025
13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.
News December 5, 2025
పాన్ మసాలాలపై సెస్.. బిల్లుకు ఆమోదం

పాన్ మసాలాలపై సెస్ విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ద్వారా వీటి తయారీలో ఉపయోగించే యంత్రాలు, ప్రక్రియలపై సెస్ విధించనున్నారు. వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్లో(CFI) జమ చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. ప్రస్తుతానికి పాన్ మసాలాలపైనే సెస్ అని, అవసరమైతే ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.


