News June 4, 2024

నరసాపురం, ఉంగుటూరులో జనసేన విక్టరీ

image

AP: నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నారాయణ నాయికర్ గెలుపొందారు. తన ప్రత్యర్థి వరప్రసాద్ రాజు(వైసీపీ)పై 49738 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 94116 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి వర ప్రసాద్‌కి 44378 ఓట్లు పడ్డాయి. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Similar News

News January 24, 2026

‘రథ సప్తమి’ ఎందుకు జరుపుకొంటారు?

image

సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే క్రమంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు. అలాగే సూర్యుడు 7 గుర్రాల రథంపై జగత్తుకు దర్శనమిచ్చింది కూడా ఈరోజే. నేటి నుంచి సూర్య కిరణాలు భూమికి దగ్గరగా వచ్చి ప్రాణికోటికి చైతన్యం, జఠరాగ్ని పెరుగుతాయని నమ్ముతారు. పాపాలను హరింపజేసే తిథి సూర్యారాధనకు అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

News January 24, 2026

ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ₹3,500తో గోవా టూర్

image

TGSRTC ప్రత్యేక లోబడ్జెట్‌ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. FEB 2వ వారంలో వరుస సెలవులతో గోవా టూర్‌ను ప్రకటించింది. లగ్జరీ బస్సులో ఒక్కరు ₹3,500కే 3 నైట్స్, 4 డేస్ ప్రయాణంతో గోవా టూర్ చేయొచ్చు. గోవాతో పాటు హంపీ, తుల్జాపూర్‌ల సందర్శనా ఉంటుంది. అలాగే ₹3వేలతోనే పండరీ పూర్, గానుగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. వివరాల కోసం 9391072283/9063401072 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

News January 24, 2026

గణతంత్ర వేడుకల్లో దళనాయకిగా సిమ్రన్ బాలా

image

జమ్ము కశ్మీర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలా ఆల్‌ మేల్‌ CRPF దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. ఈ ఘనత పొందిన మొదటి మహిళా అధికారిణి బాలా. 2023 మేలో మొదటి ప్రయత్నంలోనే దేశస్థాయిలో 82వ ర్యాంకును సాధించి CRPFలో చేరారు. పరేడ్‌ రిహార్సల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన, శిక్షణ, ఫీల్డ్‌ పోస్టింగ్‌లలో విశిష్ట రికార్డు సొంతం కావడం వల్లే ఈ అవకాశం దక్కింది.