News August 9, 2024

ఛైర్మ‌న్ తీరుపై జ‌యా అభ్యంత‌రం

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌, ఎస్పీ ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మ‌ధ్య మ‌రోసారి పేరు వివాదం తలెత్తింది. ఛైర్మ‌న్ ధ‌న్‌ఖ‌డ్ మ‌రోసారి జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్‌ అని పిలవ‌డంపై ఆమె అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జయా డిమాండ్ చేయగా తనకు పాఠాలు చెప్ప‌వద్దంటూ ఛైర్మన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌యాకు సోనియా మ‌ద్ద‌తుగా నిలవగా ఛైర్మ‌న్ తీరును నిర‌సిస్తూ విప‌క్షాలు వాకౌట్ చేశాయి.

Similar News

News November 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్‌కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ గోల్డ్ గెలిచాడు

News November 19, 2025

పుట్టపర్తికి మోదీ… స్వాగతం పలికిన సీఎం

image

AP: శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు.

News November 19, 2025

రాగి వస్తువులు ఇలా శుభ్రం..

image

ఇటీవలి కాలంలో రాగి పాత్రల వాడకం ఎక్కువైంది. వీటిని శుభ్రం చేయడం పెద్ద టాస్క్. దాని కోసం కొన్ని టిప్స్. శనగపిండి, పెరుగు, ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో రాగి పాత్రలను రుద్దితే మెరిసిపోతాయి. చెంచా ఉప్పుకి, రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంతో ఈ వస్తువులను తోమండి. మునుపటిలా తిరిగి తళతళలాడటం మీరే గమనిస్తారు. అలాగే నిమ్మరసం, ఉప్పు, బేకింగ్ సోడా కలిపి తోమినా కొత్తవాటిలా కనిపిస్తాయి.