News August 9, 2024

ఛైర్మ‌న్ తీరుపై జ‌యా అభ్యంత‌రం

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌, ఎస్పీ ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మ‌ధ్య మ‌రోసారి పేరు వివాదం తలెత్తింది. ఛైర్మ‌న్ ధ‌న్‌ఖ‌డ్ మ‌రోసారి జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్‌ అని పిలవ‌డంపై ఆమె అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జయా డిమాండ్ చేయగా తనకు పాఠాలు చెప్ప‌వద్దంటూ ఛైర్మన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌యాకు సోనియా మ‌ద్ద‌తుగా నిలవగా ఛైర్మ‌న్ తీరును నిర‌సిస్తూ విప‌క్షాలు వాకౌట్ చేశాయి.

Similar News

News July 11, 2025

మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

image

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

News July 11, 2025

బిజినెస్ అప్‌డేట్స్

image

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు

News July 11, 2025

రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.