News December 2, 2024

మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్-2025

image

జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్షల షెడ్యూల్‌ను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. మే 18న పరీక్ష జరగనుంది. పేపర్ 1 ఉ.9 గం. నుంచి మ.12 వరకు, పేపర్ 2 మ.2.30 గం. నుంచి సా.5.30 వరకు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, NITల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Similar News

News October 30, 2025

అమల్లోకి రాని 8.82 లక్షల కోర్టు తీర్పులు

image

కోర్టులు వరమిచ్చినా అధికారులు కరుణించలేదన్నట్లు మారింది దేశంలో తీర్పుల అమలు. న్యాయం కోసం దాఖలైన కేసులు 5CRకు పైగా ఉండగా తీర్పులు వచ్చినా అమలు కోసం ఎదురుచూస్తున్న వారు 8.82 లక్షల మంది ఉన్నారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల్లో 39% MHలో ఉన్నాయి. TN 86148, KL 82997, AP 68137,MP 52219 కేసులున్నాయి. ఈ తీర్పులను ఆరునెలల్లో అమలయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని SC అన్ని HCలను ఆదేశించింది.

News October 30, 2025

నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

image

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్‌మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.

News October 30, 2025

సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

image

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.