News January 18, 2025

JEE మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-1 అడ్మిట్ కార్డులను NTA రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి తమ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 22, 23, 24న రెండు షిఫ్టుల్లో బీఈ/బీటెక్ పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈనెల 28, 29, 30న జరిగే పేపర్-1, పేపర్-2 పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో రిలీజ్ కానున్నాయి.

Similar News

News February 13, 2025

ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

image

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.

News February 13, 2025

తొలి లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు: శివ కార్తికేయన్

image

తన లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయని తమిళ హీరో శివకార్తికేయన్ వెల్లడించారు. ‘నాది వన్ సైడ్ లవ్. అప్పటికే ఆమెకు లవర్ ఉన్నాడు. దూరం నుంచే చూస్తూ ప్రేమించా. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్‌లో కనిపించింది. అప్పటికే ఆమెకు పెళ్లి అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ప్రేమించిన వాడిని కాకుండా వేరే వ్యక్తిని వివాహమాడింది. నాకు దొరకని అమ్మాయి ఆ వ్యక్తికీ దొరకలేదు’ అని నవ్వుతూ చెప్పారు.

News February 13, 2025

అన్‌లిమిటెడ్ పానీపూరీ.. ఎక్కడంటే?

image

వినోదాన్ని పొందేందుకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నట్లుగానే పానీపూరీ తినేందుకు ఉండాలని ఓ వ్యక్తి ఆలోచించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.99,000 చెల్లిస్తే జీవితాంతం అన్‌లిమిటెడ్ పానీపూరీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఒకేసారి డబ్బు చెల్లించాలని పేర్కొన్నాడు. ఈ ఆఫర్ తీసుకున్నవారు ఏ సమయంలోనైనా షాప్‌కి వచ్చి పానీపూరీ తినొచ్చని తెలిపాడు. గతంలోనూ బాహుబలి పానీపూరీ పేరుతో ఆయన క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించారు.

error: Content is protected !!