News January 22, 2025
ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు

దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
Similar News
News January 12, 2026
చేనేత సహకార సంఘాలకు రూ.5 కోట్లు

AP: చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. DECలో ఆప్కో బకాయిల్లో రూ.2.42 కోట్లు చెల్లించారు. సంక్రాంతి సందర్భంగా మరో రూ.5 కోట్ల బకాయిలు చెల్లించాలని మంత్రి సవిత ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, జియోమార్ట్ ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించామన్నారు.
News January 12, 2026
వచ్చే వారం ఇన్వెస్టర్ల ముందుకు ఆరు IPOలు

ఈ నెల 12 నుంచి 16 వరకు మార్కెట్కు ఆరు IPOలు రానున్నాయి. వీటిలో అమాగీ మీడియా ల్యాబ్స్ ఒక్కటే మెయిన్ బోర్డ్ ఐపీఓ కాగా, మిగతా ఐదు ఎస్ఎంఈ (Small and Medium Enterprises) విభాగానికి చెందినవే. అమాగీ ఐపీఓ జనవరి 13న ప్రారంభమై 16న ముగియనుంది. షేరు ధర రూ.343-361 మధ్య ఉండగా రూ.1,789 కోట్లు సమీకరించనుంది. ఇదిలా ఉండగా శుక్రవారం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన భారత్ కోకింగ్ కోల్ ఐపీఓకు భారీ స్పందన లభిస్తోంది.
News January 12, 2026
శాస్త్రం చూసి మరీ కోడి పందేలు.. ఎందుకంటే?

గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ పందెంలో గెలవడానికి పుంజుకి సత్తా ఉంటే సరిపోదట, గ్రహాలు కూడా అనుకూలించాలట. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఓ గ్రంథమే అందుబాటులో ఉంది. అదే ‘కుక్కుట శాస్త్రం’. పందెం రాయుళ్లు కోడి పందేల సమయంలో ఈ గ్రంథంపైనే ఆధారపడతారట. అసలు ఈ గ్రంథంలో ఏముంటుంది? పందెం కోళ్ల విజయాలపై ఈ గ్రంథం ఏం చెబుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


