News January 22, 2025

ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు

image

దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

Similar News

News February 15, 2025

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, MLA కోటా MLC పదవులు సహా మరికొన్ని అంశాలపై ఆయనతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.

News February 15, 2025

వంశీ ఫోన్ కోసం ఇంట్లో సోదాలు

image

హైదరాబాద్ రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో ఆయన ఫోన్ కీలకం కావడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అది చేతికి వస్తేనే ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.

News February 15, 2025

ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

image

సోషల్ మీడియా దిగ్గజం ‘ఇన్‌స్టాగ్రామ్’లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. రెడ్డిట్‌లో అప్‌ఓట్, డౌన్‌ఓట్ ఉన్నట్లు ఇన్‌స్టాలోనూ పోస్టు కింద చేసిన కామెంట్ నచ్చకపోతే డిస్ లైక్ చేసే ఫీచర్ తీసుకొచ్చేందుకు ‘మెటా’ యోచిస్తోంది. యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో లవ్(లైక్) బటన్ మాత్రమే ఉంది.

error: Content is protected !!