News March 26, 2024

జియో రూ.555 రీఛార్జ్ ఫ్రీ అంటూ ప్రచారం

image

జియో ఫ్రీ రీఛార్జ్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ‘జియో ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉచితంగా రూ.555 రీఛార్జ్ పొందండి’ అని మెసేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి ఉచిత ఆఫర్లను నమ్మి, వారు పంపిన లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు చోరీ అవుతాయన్నారు. వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను నమ్మవద్దని సూచించారు.

Similar News

News November 22, 2025

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలి: KMR కలెక్టర్

image

గ్రామ పంచాయతి ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, వ్యయ పర్యవేక్షణ వంటి కీలక విభాగాలకు అధికారులను నియమించారు. పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు వంటి మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

News November 22, 2025

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలి: KMR కలెక్టర్

image

గ్రామ పంచాయతి ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, వ్యయ పర్యవేక్షణ వంటి కీలక విభాగాలకు అధికారులను నియమించారు. పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు వంటి మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

News November 22, 2025

టుడే టాప్ న్యూస్

image

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి