News May 18, 2024
పంజాబ్ కెప్టెన్గా జితేశ్ శర్మ

రేపు హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్కు పంజాబ్ కెప్టెన్గా జితేశ్ శర్మ వ్యవహరించనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ సామ్ కరన్ స్వదేశం వెళ్లిపోవడంతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఈ సీజన్లో జితేశ్ పూర్తిగా నిరాశపరిచారు. 13 మ్యాచ్లు ఆడి 155 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ సీజన్లో ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి ఐదింట్లోనే గెలిచింది.
Similar News
News October 21, 2025
స్పామ్ మెసేజ్ల నియంత్రణకు వాట్సాప్లో కొత్త ఫీచర్!

స్పామ్ మెసేజ్ల నియంత్రణకు WhatsApp ఓ ఫీచర్ను తీసుకొస్తోంది. యూజర్లు లేదా బిజినెస్ అకౌంట్స్ నుంచి అన్నోన్ నంబర్లకు పంపే బ్రాడ్కాస్ట్ మెసేజ్లకు లిమిట్ విధించనుంది. కొత్త నంబర్లకు మెసేజ్లు పంపినప్పుడు వారి నుంచి రిప్లైలు రాకపోతే ఆ మెసేజ్లన్నీ లిమిట్ లిస్టులో యాడ్ అవుతాయి. ఒక్కో మంత్లో నిర్దేశించిన లిమిట్కి చేరగానే మళ్లీ మెసేజ్లు పంపేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది.
News October 21, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.
News October 21, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు సూచనలు

వేసవి దుక్కులను నిర్లక్ష్యం చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని ఆచరించాలి. భూమి నుంచి మురుగు నీరు బయటకుపోయేట్లు చూడాలి. వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలను మొక్కలకు అందించాలి. సమగ్ర నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. కలుపు మొక్కల నిర్మూలన చేపట్టాలి. విత్తన శుద్ధి తప్పక చేయాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించాలి. తెగుళ్ల లక్షణాలను గుర్తించిన వెంటనే నిపుణుల సూచనలతో నివారణ మందులను తప్పక పిచికారీ చేయాలి.