News April 27, 2024

ఎల్లుండి రాష్ట్రానికి జేపీ నడ్డా

image

TG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 29న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారు. 30న ప్రధాని మోదీ అల్లాదుర్గ్ సభ, 3న వరంగల్, నల్గొండ, 4న మహబూబ్‌నగర్, వికారాబాద్ సభల్లో పాల్గొంటారు. మే 1న హోంమంత్రి అమిత్ షా చార్మినార్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Similar News

News January 23, 2026

లిక్కర్ స్కామ్.. ముగిసిన మిథున్‌రెడ్డి విచారణ

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7 గంటలపాటు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. మిథున్‌రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో అధికారులు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.

News January 23, 2026

వృద్ధాప్యానికి చెక్‌ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

image

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.

News January 23, 2026

INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

image

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.