News August 2, 2024

ఆర్-5 జోన్‌పై న్యాయ పరిశీలన చేస్తున్నాం: నారాయణ

image

AP: అమరావతిలో వివాదాస్పదమైన ఆర్-5 జోన్‌పై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్షా సమావేశంలో చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్‌పై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా అమరావతిలో R-5 జోన్ ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. స్థానికేతరులకు స్థలాలివ్వడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.

Similar News

News December 11, 2025

అఖండ-2 టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్

image

అఖండ-2 సినిమా <<18531616>>నిర్మాతలకు<<>> తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అటు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ మొదలవనుండగా ఇప్పటికే అభిమానులు రూ.600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు.

News December 11, 2025

భారత సంగీతానికి ప్రపంచ కీర్తి తెచ్చిన గాయని

image

సంగీత ప్రపంచంలో మొదటగా భారతరత్న అవార్డు, రామన్ మెగసెసే పురస్కారం పొందిన మొదటి కళాకారిణి MS సుబ్బులక్ష్మి. 1916 సెప్టెంబరు 16న మదురైలో జన్మించిన ఆమె తన మధురగానంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆ మహాగాయిని వర్థంతి నేడు. లండన్‌లో క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో పాడి శ్రోతలను తన స్వరంతోనే కట్టి పడేసి భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సుబ్బులక్ష్మి గారిది.

News December 11, 2025

IPL మినీ వేలం.. తొలి సెట్ ఇదే..

image

ఈ నెల 16న అబుదాబీలో IPL మినీ వేలం జరగనుంది. తొలి సెట్లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో డెవాన్ కాన్వే, జాక్ ఫ్రేజర్, కామెరూన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా ఉన్నారు. సర్ఫరాజ్, పృథ్వీ షా ధరను రూ.75లక్షలుగా, మిగతా వారి బేస్ ప్రైజ్‌ను రూ.2కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ వేలంలో గ్రీన్ అత్యధిక ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలంటున్నాయి.