News April 10, 2024
ఈ నెల 12న జూనియర్ టోఫెల్ పరీక్షలు

AP: ఈ నెల 12న 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు జూనియర్ టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,104 స్కూళ్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రవేశపెట్టిన టోఫెల్ కోర్సు పరీక్షను 3,4,5 తరగతుల విద్యార్థులకు ఇటీవల నిర్వహించారు. 4.17 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైనట్లు వెల్లడించింది.
Similar News
News January 29, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.10,800 ఎగబాకి రూ.1,63,950 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 29, 2026
మొక్కజొన్న పంటలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

మొక్కజొన్న పైరు ఒకవేళ 60 నుంచి 65 రోజుల దశలో ఉంటే పంటకు అవసరం మేర ఎరువులను అందించాలి. ఈ సమయంలో చివరి దఫా నత్రజని ఎరువుగా ఎకరాకు 50 కిలోల యూరియా మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. పూత దశకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో పైరుకు నీటి తడులను తప్పనిసరిగా అందించాలి. నేల స్వభావం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటిని అందించకుంటే పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.
News January 29, 2026
కరుంగలి మాల ఎందుకు ధరించాలంటే…?

కరుంగలి మాల ఆభరణమే కాదు! శక్తిమంతమైన రక్షణ కవచం కూడా. ఇది ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దరిచేరనీయదు. కుజ దోషం ఉన్నవారు దీనిని ధరిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, సోమరితనాన్ని తగ్గించి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు, ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నవారు ఈ పవిత్రమైన మాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని సిద్ధ సంప్రదాయం చెబుతోంది.


