News January 14, 2025
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 11, 2025
TODAY TOP STORIES

* ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!
* ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక: రేవంత్
* 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు
* TGలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు
* రేవంత్ రాజీనామా చేసి రా: KTR సవాల్
* YCP టార్గెట్గా పృథ్వీ సెటైర్లు.. క్షమాపణ చెప్పిన విశ్వక్ సేన్
* చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రిట్జ్కే
* ప్రశాంతంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలి: మోదీ
News February 11, 2025
మీకూ గాఢ నిద్రలో ఇలా జరుగుతోందా?

కొందరు రాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏడుస్తుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైనవారు చేజారిపోతున్నట్లు, మరణిస్తున్నట్లు కల వస్తే ఏడుస్తారు. జీవితంలో మానసిక దెబ్బలు తిన్నవారు కూడా అసంకల్పితంగా నిద్రలో ఏడుస్తుంటారు. అణిచిపోయిన భావోద్వేగాలతోనూ నిద్రలో ఏడ్చే అవకాశం ఉంది. బైపోలార్ డిజార్డర్, స్లీప్ ఆప్నియా, ఇన్సోమ్నియా, మూడ్ స్వింగ్స్ ఉన్నవారూ ఇలాగే ప్రవర్తిస్తారు.
News February 11, 2025
BIG BREAKING: బీర్ల ధరలు పెంపు

తెలంగాణలో మందుబాబులకు షాక్. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఏపీలో రూ.99 మద్యం, బీర్ల ధరలు తప్ప మిగతా మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.