News April 8, 2025
పల్లా, రాజయ్యకు కడియం సవాల్

TG: భూముల కబ్జాకు ప్రయత్నించారనే BRS నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఆరోపణలపై MLA కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ‘నాపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి విడిచి మీకు గులాంగిరి చేస్తాను. లేకపోతే మీరు నాకు గులాంగిరి చేయాలి’ అని వారికి సవాల్ విసిరారు. చీము నెత్తురు ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని కడియం స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
భారత్కు ప్రతి టెస్టు కీలకమే

WTC 2025-27 సీజన్లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.


