News April 8, 2025
పల్లా, రాజయ్యకు కడియం సవాల్

TG: భూముల కబ్జాకు ప్రయత్నించారనే BRS నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఆరోపణలపై MLA కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ‘నాపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి విడిచి మీకు గులాంగిరి చేస్తాను. లేకపోతే మీరు నాకు గులాంగిరి చేయాలి’ అని వారికి సవాల్ విసిరారు. చీము నెత్తురు ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని కడియం స్పష్టం చేశారు.
Similar News
News April 20, 2025
PHOTOS: స్టైలిష్ లుక్లో Jr.NTR

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ కోసం Jr.NTR బయల్దేరినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేనితో ఆయన ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తారక్ కొత్తగా, స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈనెల 22 నుంచి షూటింగ్లో పాల్గొంటారు. అయితే షూటింగ్ ఎక్కడ జరగనుంది? హీరో ఎక్కడికి బయల్దేరారనే విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించలేదు.
News April 20, 2025
‘గ్లోబల్ మీడియా డైలాగ్’కు మోదీ సారథ్యం

ముంబైలో మే 1-4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES)లో ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ అంశానికి PM మోదీ సారథ్యం వహించనున్నారు. వివిధ దేశాల్లోని మీడియా, ఎంటర్టైన్మెంట్(M&E) రంగాల క్రియేటర్స్ను కనెక్ట్ చేసే వేదికే WAVES. సమ్మిట్లో పలు అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ నినాదంతో M&E హబ్కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
News April 20, 2025
BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్

TG: ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ కంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్ను సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంది. కానీ 500 రోజులైనా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.