News March 17, 2024

కాకినాడ: పవన్‌కళ్యాణ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

image

చంద్రబాబు హామీతో అలక వీడిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శనివారం రాత్రి మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, టీడీపీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. మరో నాలుగు ఐదు రోజుల్లో తాను పిఠాపురం వస్తానని, తగిన ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Similar News

News February 4, 2026

కడియం నర్సరీ అందాలకు హాలీవుడ్ ప్రముఖుడి ఫిదా..!

image

కడియం నర్సరీల అందాలకు హాలీవుడ్ ప్రముఖుడు డాన్ చో ముగ్ధులయ్యారు. దక్షిణ కొరియా బృందంతో కలిసి శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించిన ఆయన, త్వరలో 450 ఎకరాల్లో ఇండో-కొరియన్ నర్సరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొక్కల ఎగుమతిపై నర్సరీ రైతులతో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో కడియం మొక్కలకు గుర్తింపు రావడం పట్ల నర్సరీ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.

News February 4, 2026

రాజానగరంలో మెగా జాబ్ మేళా.. గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

image

ఫిబ్రవరి 8న రాజానగరంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం దీనికి సంబంధించిన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో టెక్నికల్, నాన్-టెక్నికల్ అభ్యర్థులు ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 4, 2026

పులిని పట్టుకోలేకపోవడం ప్రభుత్వ చేతగానితనమే: జక్కంపూడి రాజా

image

జిల్లాలో గత ఐదు రోజులుగా పులి సంచరిస్తున్నా, దానిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవాసాల్లోకి పులి వచ్చి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో అధికారులు సమర్థవంతంగా పనిచేసి పులిని అటవీ ప్రాంతంలోకి పంపించారని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.