News July 12, 2024

రూల్ పెట్టిన కంగనా రనౌత్.. కాంగ్రెస్ ఫైర్!

image

తనను కలవాలంటే ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలని మండి ఎంపీ కంగనా రూల్ పెట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకులు వస్తుంటారని, కాబట్టి స్థానికులేనని నిర్ధారించేందుకు ఆధార్ తేవాలని ఆమె తెలిపారు. అలాగే తాము ఏ పని మీద కలుస్తున్నామో లేఖ కూడా రాయాలన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ ఫైరయ్యారు. ‘ప్రజల్ని కలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత. దానికి ID అవసరం లేదు’ అని ఫైరయ్యారు.

Similar News

News November 9, 2025

సమాజం కోసం ఏర్పడిందే RSS: మోహన్ భాగవత్

image

RSS సమాజం కోసం ఏర్పడిందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ దేనికీ వ్యతిరేకం కాదు. అది అధికారాన్ని కోరుకోదు. సమాజంలో ప్రాధాన్యతను ఆశించదు. దేశ కీర్తి పెంచేందుకు సేవ చేయాలని కోరుకుంటుంది. మొదట్లో RSSను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు’ అని అన్నారు. RSS 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

News November 9, 2025

డిసెంబర్ 15న IPL వేలం!

image

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్‌లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

☛ సెమి-డబుల్ రకాలు: వీటిలో పూల రేకులు 2-3 వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: CV. సెమీ-డబుల్.
☛ డబుల్ లిల్లీ రకాలు: ఈ పూల రేకులు 3 కన్నా ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి.
☛ ఉదా: సువాసిని, స్వర్ణ రేఖ, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్, పెర్ల్ డబుల్. ఈ రకాలను ఎక్కువగా బొకేల తయారీలో వాడతారు. ☛ రైతులు ఏ ఉద్దేశంతో వీటిని సాగు చేయాలనుకుంటున్నారో అందుకు అనువైన రకాన్ని వ్యవసాయ నిపుణుల సూచనలతో ఎన్నుకోవడం మంచిది.