News August 27, 2024

కంగనా వ్యాఖ్యలు దేశంలోని రైతులకు ఘోర అవమానకరం: రాహుల్

image

రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన <<13945604>>వ్యాఖ్యలు <<>>హరియాణా, పంజాబ్‌తో సహా దేశంలోని రైతులందరికీ ఘోర అవమానకరమని రాహుల్ గాంధీ అన్నారు. రైతు వ్యతిరేక భావజాలం మోదీ ప్రభుత్వ డీఎన్ఏ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. అధికార పార్టీ కంగనా వ్యాఖ్యలతో ఏకీభవించకపోతే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Similar News

News January 9, 2026

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

image

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.

News January 9, 2026

ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

image

ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్‌లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.

News January 9, 2026

మళ్లీ పెరిగిన బంగారం ధర!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.1,310 పెరిగి రూ.1,39,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.1,27,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.