News November 3, 2024
‘కంగువ’ టికెట్ ధరలు పెంపు?

తమిళ హీరో సూర్య నటించిన ‘కంగువ’ ఈనెల 14న రిలీజ్ కానుంది. టాలీవుడ్ టైర్-1 హీరో మూవీ రిలీజ్ మాదిరిగానే భారీస్థాయిలో ఇక్కడ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 4AM షోస్కు, టికెట్ ధరల పెంపునకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో డబ్బింగ్ మూవీకి హైక్ ఇవ్వడమేంటని కొందరు Xలో ప్రశ్నిస్తున్నారు. మన సినిమాలకు అక్కడ కనీసం థియేటర్లు కూడా ఇవ్వట్లేదని మండిపడుతున్నారు. మీ కామెంట్?
Similar News
News July 6, 2025
పాడేరు: ‘ఆక్రమణలను పక్కాగా తొలగించాలి’

ప్రభుత్వ భూముల ఆక్రమణలను పక్కాగా తొలగించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి తాహశీల్దారులు, ఎంపీడీవోలతో భూ ఆక్రమణలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోర్టు కేసుల విషయంలో కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, బంజరు భూములు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. ఆక్రమణదారులకు ముందుగా ఫారం 6, ఫారం 7నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.