News February 19, 2025

కశ్మీర్‌కు కరువు ముప్పు: వాతావరణ శాఖ

image

జమ్మూకశ్మీర్‌ కరువు ముప్పు ముంగిట ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడచిన 3 నెలల్లో వర్షపాతం 80శాతం మేర పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో ఎప్పుడూ అనావృష్టి లేదని పేర్కొంది. నదీజలాల స్థాయులు పడిపోయాయని, ప్రజాజీవితాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఈ నెలలో రెండుసార్లు వర్షపాతం పడాల్సి ఉందని, అది పడితే పరిస్థితి కొంత మెరుగవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

Similar News

News March 18, 2025

9 నెలలు అంతరిక్షంలోనే ఎందుకున్నారంటే?

image

గత ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉన్నారు. 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా వీళ్లను తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తాయి. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. దీంతో SEP 7న వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ భూమికి తిరిగి రాగా వారు అక్కడే ఉండిపోయారు.

News March 18, 2025

అందుకే 24ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నా: పార్తీబన్

image

నటి సీతతో విడాకుల తర్వాత ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదని నటుడు R.పార్తీబన్ అన్నారు. భార్యగా వేరొకరికి స్థానం ఇవ్వలేనని, అందుకే ఒంటరిగా ఉంటున్నానని ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. సీతతో ఇప్పుడు టచ్‌లో లేనని, ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం అంత్యక్రియలు జరిపానని అన్నారు. 1990లో వీరు వివాహం చేసుకోగా 2001లో విడాకులు తీసుకున్నారు. సీత 2010లో మరో పెళ్లి చేసుకుని 2016లో విడిపోయారు.

News March 18, 2025

అంతరిక్షం నుంచి వచ్చాక స్ట్రెచర్లపైనే బయటకు..

image

స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సుల్‌లో రేపు తెల్లవారుజామున భూమిపైకి రానున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై అందరి దృష్టి నెలకొంది. క్యాప్సుల్ తెరుచుకున్న వెంటనే వీరిని స్ట్రెచర్స్‌లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పేస్ నుంచి ఒక్కసారిగా భూమిపైకి రావడం, అంతరిక్షంలో నెలల పాటు ఉండటంతో వీరి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవలేని స్థితిలో ఉంటారని అంటున్నారు.

error: Content is protected !!