News April 2, 2024
కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 2/3

ఇక శ్రీనగర్లో ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలు నేషనల్ కాన్ఫరెన్స్ గుప్పిట్లో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ మరోసారి ఇక్కడ గెలవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో NC, PDP భాగమైనా.. సీట్ల పంపిణీకి NC ససేమిరా అంటోంది. అనంతనాగ్ సీటు పీడీపీకి కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరి పోరుకు సిద్ధమైంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News December 3, 2025
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.
News December 3, 2025
19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్తోపాటు అన్ని ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ల స్వీకరణను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. అఫ్గానిస్థాన్, సోమాలియా సహా 19 నాన్ యూరోపియన్ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేషనల్ సేఫ్టీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. US నేషనల్ గార్డుపై అఫ్గానిస్థాన్ పౌరుడు దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
News December 3, 2025
వన్యప్రాణులతో పొలాలకు పెరుగుతున్న ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు వన్యప్రాణుల ముప్పు పెరుగుతోంది. AP, తెలంగాణలో 90% పంట పొలాలకు కోతుల సమస్య, 50% పొలాలకు అడవి పందుల సమస్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. TG లోని గద్వాల్, MBNR, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కృష్ణ జింకలతో.. APలోని అనేక జిల్లాల్లో కోతులు, అడవి పందులు, కృష్ణజింకలు, దుప్పులతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అదనంగా ఏనుగులతో పంట పొలాలకు నష్టం వాటిల్లుతోంది.


