News April 8, 2025

ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత దీక్ష

image

TG: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఇదే విషయమై వినతిపత్రం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు దీక్ష సాగనుంది. ఈ దీక్షలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 23, 2025

ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

image

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్‌లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.

News April 23, 2025

స్కూళ్లకు సెలవులు షురూ

image

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఇవాళ చివరి వర్కింగ్ డే ముగిసింది. రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ప్రస్తుతం ఎండలు ముదిరినందున పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే ఈత కోసం చెరువులు, కాల్వల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలి.

News April 23, 2025

‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్.. అరెస్టు

image

J&Kలో ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ మిలత్ నగర్‌కు చెందిన మహమ్మద్ నౌషద్ ‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా పోస్ట్ చేయడం వెనుక అతడి ఉద్దేశమేంటి? ఎలాంటి లింక్స్ ఉన్నాయనేది కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!