News March 18, 2024
నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కవిత భర్త!
TS: MLC కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు KTR, హరీశ్రావు కలిశారు. ఇవాళ పలువురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది కలిసే అవకాశం ఉంది.
Similar News
News September 30, 2024
పదో తరగతి మార్కులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు <
News September 30, 2024
ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
APలో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2023 జులై నుంచి 2024 జూన్ వరకు కేంద్రం సర్వే నిర్వహించి ఈ గణాంకాలను ప్రకటించింది. దేశంలో 11రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ లిస్టులో కేరళ టాప్లో ఉండగా, AP ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,032 మంది అమ్మాయిలున్నారు.
News September 30, 2024
బుమ్రా IPL వేలంలోకి వస్తే?: హర్భజన్
టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా IPL వేలంలోకి వస్తే టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలుస్తారని మాజీ క్రికెటర్ హర్భజన్ అన్నారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? అని తన ఫాలోవర్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ముంబై జట్టులో ఉన్న బుమ్రాకు రూ.12కోట్లు వస్తున్నాయి. వచ్చే సీజన్కు ఆయన ముంబైతోనే ఉంటారా? ఉంటే వచ్చే ప్రైస్ ఎంత? లేదా ఆక్షన్లోకి వస్తారా? అనేది రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక తెలుస్తుంది.