News March 18, 2024

నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కవిత భర్త!

image

TS: MLC కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు KTR, హరీశ్‌రావు కలిశారు. ఇవాళ పలువురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది కలిసే అవకాశం ఉంది.

Similar News

News March 28, 2025

ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు

image

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్ కేసు(OMC)లో ఎట్టకేలకు విచారణ ముగిసింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు CBI కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులుగా గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. 219 సాక్షులను విచారించడంతోపాటు 3,337 డాక్యుమెంట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతోంది.

News March 28, 2025

30 బంతుల్లో 31.. కోహ్లీపై ట్రోల్స్

image

చెన్నైతో మ్యాచులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. విరాట్ ఓపెనింగ్ వచ్చి 30 బంతుల్లో 31 రన్స్ చేసి ఔటయ్యారు. టీ20లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడారని ఎద్దేవా చేస్తున్నారు. చాలా షాట్లు కనెక్ట్ చేయలేకపోయారని పోస్టులు చేస్తున్నారు. పిచ్ కఠినంగా ఉందని, అక్కడ వేగంగా ఆడటం కష్టమని కోహ్లీ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. మరి ఇవాళ్టి కోహ్లీ ఇన్నింగ్సుపై మీ కామెంట్?

News March 28, 2025

బాబోయ్ ఎండలు.. రేపు 223 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. కమలాపురం, తాటిచెర్లలో 42.6, ఆలమూరులో 42.5, వెంకటగిరిలో 42.2, రావికమతంలో 42.1, వతలూరులో 42 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 223 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!