News March 11, 2025

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 65% పూర్తి: కిషన్ రెడ్డి

image

TG: హన్మకొండ(D) కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు పనులు 65% పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు రివైజ్డ్ బడ్జెట్ రూ.716 కోట్లు అని పేర్కొన్నారు. 160 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఏడాదికి 2,400కు పైగా వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో షేర్ చేశారు.

Similar News

News April 4, 2026

ఔషధాలపై ట్రంప్ టారిఫ్స్.. ఇండియాపై ప్రభావమెంత?

image

అమెరికా రీసెంట్‌గా కొన్ని పేటెంటెడ్ డ్రగ్స్‌పై 100% టారిఫ్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇండియాపై పెద్దగా ప్రభావం ఉండదని GTRI చెబుతోంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేది తక్కువ ధర ఉండే ‘జనరిక్’ మెడిసిన్స్ మాత్రమేనని వివరించింది. మన ఎగుమతుల్లో పేటెంటెడ్ డ్రగ్స్ వాటా తక్కువ కాబట్టి మన ఫార్మా కంపెనీలు సేఫ్ జోన్‌లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.

News April 4, 2026

ఇవాళ, రేపు జాగ్రత్త!

image

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.

News April 4, 2026

ALERT: ఇవాళ వర్షాలు

image

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.