News March 11, 2025

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 65% పూర్తి: కిషన్ రెడ్డి

image

TG: హన్మకొండ(D) కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు పనులు 65% పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు రివైజ్డ్ బడ్జెట్ రూ.716 కోట్లు అని పేర్కొన్నారు. 160 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఏడాదికి 2,400కు పైగా వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో షేర్ చేశారు.

Similar News

News October 22, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ 16 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ( కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 10 పోస్టులకు అప్లైకి ఈ నెల 24 ఆఖరు తేదీ కాగా.. 6 పోస్టులకు ఈ నెల 28 లాస్ట్ డేట్. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dic.gov.in/

News October 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 43

image

1. జనకుని తమ్ముడి పేరు ఏంటి?
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ఎవరు?
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం ఏది?
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ఏమిటి?
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ఏమంటారు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 22, 2025

సౌదీలో ‘కఫాలా’ రద్దు.. ఏంటో తెలుసా?

image

సౌదీ అరేబియాలో 1950ల నుంచి ‘కఫాలా’ సిస్టమ్ అమల్లో ఉంది. పాస్‌పోర్టును యజమానికి సమర్పించడం, ఇంటికి వెళ్లాలన్నా, జాబ్ మారాలన్నా కచ్చితంగా పర్మిషన్ తీసుకోవడం, న్యాయ సహాయం లేకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఒకరకంగా చెప్పాలంటే విదేశీ కార్మికులను బానిసలుగా చూసేవాళ్లు. సంస్కరణల్లో భాగంగా సౌదీ యువరాజు ఇటీవల ఈ విధానాన్ని రద్దు చేశారు. దీంతో 1.3 కోట్ల మంది విదేశీ కార్మికులకు ఊరట కలగనుంది.