News February 16, 2025

కవితను చూసైనా KCR, కేటీఆర్ నేర్చుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ప్రజల కోరిక మేరకు కులగణన మరోసారి చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సర్వేలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని, కనీసం ఆమెను చూసైనా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. సర్వే పూర్తయ్యాక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తామన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి బీసీ కులగణనను చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 9, 2025

రిజల్ట్ తెలిసే KCR ప్రచారం చేయలేదు: రేవంత్

image

జూబ్లీహిల్స్‌లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని KTR చేసిన విమర్శలపై రేవంత్ స్పందించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టే జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇతర చోట్ల ఉపఎన్నికలు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశానన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపుపై KCRకు నమ్మకం లేదన్నారు. అందుకే సునీతను గెలిపించాలని కనీసం ప్రకటనైనా విడుదల చేయలేదని కౌంటర్ వేశారు.

News November 9, 2025

మంచి మనసు చాటుకున్న శ్రీచరణి

image

వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె ట్రైనింగ్ పొందిన కడప క్రికెట్ అకాడమీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీచరణిని అభినందిస్తూ కడప టీడీపీ అధ్యక్షుడు, కమలాపురం MLA రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వాటిని అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న అండర్-14 క్రికెట్ టీమ్ ప్రోత్సాహానికి కేటాయించాలని శ్రీచరణి కోరారు.

News November 9, 2025

ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

image

దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘భారీగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. హరియాణాలో మాదిరే MP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగింది. ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే <<18119730>>SIR<<>>’ అని ఆరోపించారు.