News February 16, 2025

కవితను చూసైనా KCR, కేటీఆర్ నేర్చుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ప్రజల కోరిక మేరకు కులగణన మరోసారి చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సర్వేలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని, కనీసం ఆమెను చూసైనా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. సర్వే పూర్తయ్యాక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తామన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి బీసీ కులగణనను చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 24, 2025

నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP

image

AP: అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

News March 24, 2025

ఎలుక వల్ల భారీగా షేర్ల పతనం!

image

అద్భుతంగా రాణిస్తున్న కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయంటే ఆదాయం తగ్గడమో, ప్రపంచ మార్కెట్ ట్రెండ్లో కారణమని అనుకుంటాం. కానీ జపాన్‌కు చెందిన జెన్షో హోల్డింగ్స్ కో అనే రెస్టారెంట్ చెయిన్ షేర్ విలువ మాత్రం ఎలుక కారణంగా పడిపోయింది. ఆ సంస్థకు చెందిన ఓ శాఖలో కస్టమర్‌కి సూప్‌లో ఎలుక వచ్చింది. అతడి ఫిర్యాదుతో హోటల్‌లో పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కంపెనీ షేర్లు 7.1శాతం మేర పతనమయ్యాయి.

News March 24, 2025

పార్లమెంటులో ‘ఛావా’ చూడనున్న మోదీ, కేంద్ర మంత్రులు!

image

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఛావా’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాను త్వరలో పార్లమెంటులో ప్రదర్శిస్తారని తెలిసింది. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారని సమాచారం. నటుడు విక్కీ కౌశల్, క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. స్క్రీనింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

error: Content is protected !!