News April 25, 2024

డిప్రెషన్‌లో కేసీఆర్: మంత్రి ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ డిప్రెషన్‌లో అలా మాట్లాడరన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. రేవంత్ నాయకత్వంలో విన్నింగ్ టీమ్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్‌కు గత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Similar News

News November 25, 2025

భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలపై పార్టీల ఫోకస్!

image

జిల్లాలో 248 పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్నప్పటికీ, తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందేలా ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ పోరును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థులపై నియోజకవర్గ స్థాయి నాయకులు ఆరా తీస్తున్నారు.

News November 25, 2025

ఇవాళ ఉదయం 10 గంటలకు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా(రూ.300)ను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేయనుంది. టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని TTD తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News November 25, 2025

‘MTU 1426’ వరి వంగడం ప్రత్యేకతలు

image

‘MTU 1426’ వరి వంగడాన్ని MTU 1121, NLR 34449 రకాలను సంకరం చేసి అభివృద్ధి చేశారు. బియ్యం పారదర్శకంగా, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకానికి గింజ రాలడం బాగా తక్కువ. గింజలు చేనుపై మొలకెత్తవు. అన్నం మృదువుగా ఉండి తినడానికి అత్యంత అనుకూలం. అగ్గితెగులు, ఎండాకు తెగులు, ఉల్లికోడును కొంత మేర తట్టుకుంటున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.