News April 4, 2024
ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ప్రమేయం ఉంది: కిషన్ రెడ్డి

TG: BRS హయాంలో ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో BJP నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబీకుల ప్రమేయం ఉంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Similar News
News March 28, 2026
రోజూ పండ్లు తింటే అంతా ఆరోగ్యమే: వైద్యులు

రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే రోజుకు 2-3 రకాల పండ్లు తినడం మన ఆరోగ్యానికి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ‘పండ్లలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పండ్లలోని సహజమైన చక్కెర.. మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. పండ్లు తినకపోతే గుండె జబ్బులు, ఇన్ఫ్లమేషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. అందుకే పండ్లు తినాలి’ అని వివరించారు.
News March 28, 2026
APPLY: 1,060 ప్రభుత్వ ఉద్యోగాలు

సశస్త్ర సీమా బల్(SSB)లో 1,060 ఉద్యోగాలకు APR 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 827 కానిస్టేబుల్, 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, కార్పెంటర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, స్టీవార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, సంబంధిత విభాగాల్లో ITI పాసై, వయసు 18-27 ఏళ్లు ఉండాలి. PET/PST, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://ssb.gov.in/
News March 28, 2026
మొజ్తబా కూడా చనిపోయి ఉంటారు: ట్రంప్

ఇరాన్ అగ్ర నాయకులందరినీ హతమార్చామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆయన బహిరంగంగా కనిపించలేదని, ప్రకటనలూ వెలువడలేదని గుర్తు చేశారు. ఇరాన్ మిలిటరీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. ఇవి తప్ప మిగతా విషయాల్లో వారు బాగానే ఉన్నారని భావిస్తున్నట్లు సెటైర్ వేశారు.


