News April 4, 2024
ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ప్రమేయం ఉంది: కిషన్ రెడ్డి

TG: BRS హయాంలో ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో BJP నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబీకుల ప్రమేయం ఉంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Similar News
News February 12, 2026
జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

ప్రస్తుత కాలంలో కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వారానికోసారి హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.
News February 12, 2026
విజయ్ మాల్యా INDకు వస్తేనే పిటిషన్ను విచారిస్తాం: హైకోర్టు

తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ <<17636225>>విజయ్ మాల్యా<<>> దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని విచారించాలంటే ఆయన ఇండియాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా కోర్టుకు హాజరుకాని వ్యక్తులు ఉపశమనం కోరలేరు. ఈ పిటిషన్ను కొట్టేయకుండా మరో అవకాశమిస్తున్నాం. ఆయన వస్తారో లేదో పేర్కొంటూ అఫిడవిట్ వేయండి’ అని సూచిస్తూ FEB 18కి వాయిదా వేసింది.
News February 12, 2026
నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు

<


