News February 19, 2025

KCR ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు: మంత్రి

image

TG: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని <<15513169>>KCR<<>> ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనపడుతుందని ప్రశ్నించారు. ‘KCRకు ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌లు గుర్తుకొస్తారు. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెడితే ప్ర‌జా తీర్పును గౌర‌వించ‌లేదు. అసెంబ్లీ వైపు రాలేదు’ అని విమర్శించారు.

Similar News

News March 19, 2025

అమరావతికి రూ.31,600 కోట్ల ఖర్చు: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో రూపాయి కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించారన్నారు. దీని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB రూ.15,000 కోట్లు, హడ్కో రూ.15వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ రూ.5వేల కోట్ల రుణం దశలవారీగా తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో రూ.31,600 కోట్లు వెచ్చిస్తామని మండలిలో పేర్కొన్నారు.

News March 19, 2025

6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్: కిషన్ రెడ్డి

image

TG: 15 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలును విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీలపై ప్రజలు ఆశలు వదులుకొనేలా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. అంకెల గారడీతో ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. పదేళ్ల పాటు BRS రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టేస్తే, కాంగ్రెస్ తీరు పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని ధ్వజమెత్తారు.

News March 19, 2025

436 మంది మృతి

image

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు హమాస్ అంగీకరించకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. 2 రోజుల్లో 436 మంది పాలస్తీనీయులు మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఇందులో 183 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్‌తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని హమాస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు 61,700 మంది చనిపోయారు.

error: Content is protected !!