News July 12, 2024
ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్లోకి పంపుతున్నారు: బండి సంజయ్

TG: కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే వారిని కాంగ్రెస్లోకి పంపుతున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు కేటీఆర్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల ద్వారా నిరుద్యోగులను సీఎం రేవంత్ అణచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
Similar News
News November 11, 2025
బయో-కెమికల్ వార్: ఉగ్రసంస్థల కొత్త వ్యూహం

భారత్పై విషం చిమ్మేందుకు ఉగ్రసంస్థలు రూటు మార్చాయి. నిఘా, తనిఖీలు, సప్లై తదితర సవాళ్లు పెరగడంతో స్థానిక పదార్థాలతో నరమేధం సృష్టించే నైపుణ్యం గల వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. రసాయనాలు, వాటితో మంచి చెడులు వైద్యులకు తెలియడంతో వారినే పావులుగా మారుస్తున్నాయి. ఆముదాలతో రెసిన్ విషం తయారుచేస్తూ పట్టుబడ్డ HYD Dr. మొయిన్, ఫరీదాబాద్లో అమ్మోనియం నైట్రేట్ యూరియాతో దొరికిన ముగ్గురు వైద్యులు ఇందుకు ఉదాహరణ.
News November 11, 2025
ప్రమాదం.. వ్యక్తిని కాపాడిన స్మార్ట్ వాచ్

మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు స్మార్ట్ వాచ్ ఎలా సహాయపడుతుందో తెలిపే ఘటనే ఇది. ఓ వ్యక్తికి తీవ్ర ప్రమాదం జరిగినప్పుడు అతడి చేతికి ఆపిల్ వాచ్ ఉంది. BP, పల్స్ పడిపోవడాన్ని వాచ్ గ్రహించి ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసింది. అతడి లొకేషన్ను కొడుకుకు & అంబులెన్స్కు హెచ్చరిక సందేశాన్ని పంపింది. బాధితుడు క్షేమంగా బయటపడ్డారు. అత్యవసర SOS ఫీచర్లు యాపిల్తో పాటు Samsung & Google Pixel వాచ్ల్లోనూ ఉన్నాయి.
News November 11, 2025
యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్టెల్

ఎయిర్టెల్ తన రూ. 189 వాయిస్-ఓన్లీ ప్లాన్ను రద్దు చేసి యూజర్లకు షాక్ ఇచ్చింది. ఈ మార్పు ఓన్లీ కాలింగ్ ఫీచర్ కావాలనుకునే వారికి భారంగా మారనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ ఎంట్రీ-లెవల్ ప్లాన్ రూ. 199గా మారింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ & 2GB డేటాను అందిస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేని యూజర్లకు రూ. 189 అపరిమిత కాలింగ్ ప్లాన్ సౌకర్యంగా ఉండేది.


