News September 13, 2024

కేసీఆర్ అంటే నాకెప్పటికీ గౌరవమే: ఎమ్మెల్యే అరెకపూడి

image

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రౌడీలా మాట్లాడటం వల్లే తాను నోరు జారానని కాంగ్రెస్ MLA అరెకపూడి గాంధీ అన్నారు. ‘మహిళల్ని అవమానించేలా కౌశిక్ మాట్లాడారు. ప్రాంతీయ విభేదాలు తెచ్చారు. KCR అంటే నాకెప్పటికీ గౌరవమే. ఆయన మమ్మల్ని ఆదరించారు. కౌశిక్ వంటి చీడపురుగులు ఉంటే KCR గొప్ప మనస్తత్వానికి, గతంలో మేం చేసిన సేవలకు, పార్టీకి మచ్చ వస్తుంది. అలాంటి వాళ్ల వల్లే అధికారం కోల్పోయాం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Similar News

News November 10, 2025

₹750 కోట్లతో నేచురోపతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: మంత్రి

image

AP: తొలిసారిగా ‘అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ రాష్ట్రంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ₹750 కోట్లతో కేంద్రం నెలకొల్పే దీనిలో బ్యాచ్‌లర్ ఆఫ్ నేచురోపతి యోగా సర్జరీలో 100 సీట్లు, PGలో 20 సీట్ల చొప్పున తొలి ఏడాదిలో ఉంటాయన్నారు. దీనికోసం 40 ఎకరాలు కావాలని కేంద్రం లేఖ రాసిందని చెప్పారు. 450 పడకల నేచురోపతి ఆసుపత్రీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

News November 10, 2025

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలా?

image

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి పీల్చలేక వేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ శుభ్రమైన గాలితో పాటు కనెక్టివిటీ బాగుంటుందని వివిధ రాష్ట్రాల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని పలు కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్‌కు తరలించాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 10, 2025

భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

image

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్‌ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.