News March 17, 2024

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచండి: ముఖేశ్ కుమార్

image

సాధారణ ఎన్నికల షెడ్యుల్ జారీ అయిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోను ఎన్నికల విధులకు వాలంటీర్లను వినియోగించరాదన్నారు. ఎఫ్ఎస్‌టీ టీ్లు క్రియాశీలకంగా పని చేసే విధంగా పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈసీ సమీక్ష నిర్వహించారు.

Similar News

News January 31, 2026

గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్

image

తెనాలి మండలంలోని పెదరావూరులో గంజాయి విక్రయిస్తున్న 9మంది ని రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు తెలిపారు. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వల్లంగి విజయ్, తెనాలికి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారని సమాచారంతో పోలీసులు మాటు వేసి వారి వద్ద ఉన్న 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని సూచనలు చేశారు.

News January 31, 2026

గుంటూరులో యువకుడిపై దాడి.. SPకి ఫిర్యాదు

image

గుంటూరు మండలం వెంగలయపాలెంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన యువకుడు ఆంజనేయులుపై జరిగిన దాడి ఘటనపై బాధితుడు గుంటూరు SPకి ఫిర్యాదు చేశాడు. అదే కాలనీకి చెందిన యర్రంశెట్టి రవితేజ, గణేష్, ఈపూరి రామకృష్ణ, మణికంఠ, నరేంద్రలు కత్తులు, ఇనుప రాడ్లతో ఇంటిపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు. నిందితులపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని కోరాడు.

News January 31, 2026

GNT: రూ.7లక్షల బంగారు ఆభరణాలు చోరీ

image

రూ.7.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదు చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు అరండల్ పేట పోలీసులు తెలిపారు. కాకుమానువారితోటకు చెందిన స్వీట్ షాపు నిర్వాహకుడు సాయిపవన్ కుమార్ ఇంట్లో ఈ నెల 29న రాత్రి నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగిందన్నారు. ఉదయం చూసే సరికి ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది. అనుమానంతో ఇంట్లో పరిశీలించగా నగలు, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడన్నారు.