News February 8, 2025
అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995282894_782-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారేకు గతంలో కేజ్రీవాల్ శిష్యుడిగా ఉన్నారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీలో AAP ఓటమికి కారణాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739001526213_81-normal-WIFI.webp)
☞ కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం
☞ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ సహా కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర, సంజయ్ తదితర నేతలు జైలుకెళ్లడం
☞ కేజ్రీవాల్ జైలుకెళ్లాక AAPలో నాయకత్వ లోపం
☞ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగకపోవడం
☞ అభివృద్ధి, చెత్త తొలగించకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకుండా BJPపై పదేపదే విమర్శలు చేస్తుండటం
☞ పదేళ్ల AAP పాలన చూశాక, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్ల ఆలోచన
News February 8, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737523738226_81-normal-WIFI.webp)
బంగారం ధరలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.79,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరగడంతో రూ.86,670 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై పవన్ ఏమన్నారంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006182771_1226-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.