News January 31, 2025

మోదీ కంటే కేజ్రీవాలే కన్నింగ్: రాహుల్ గాంధీ

image

PM మోదీ తరహాలోనే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అబద్ధాలు చెబుతుంటారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వారిద్దరి మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. ఇంకా చెప్పాలంటే మోదీ కంటే కేజ్రీవాల్ ఎక్కువ కన్నింగ్ అని దుయ్యబట్టారు. ఐదేళ్లలో యమునా నది నీళ్లను తాగేందుకు అనుకూలంగా మారుస్తానన్న హామీ నీటి మూటగా మారిందని ఫైరయ్యారు. తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే కర్ణాటక, తెలంగాణ తరహాలో హామీలు నెరవేరుస్తామన్నారు.

Similar News

News February 16, 2025

ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా?

image

ప్రస్తుతం ఆన్‌లైన్, పార్సిల్‌లో వచ్చే ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో వస్తోంది. కానీ వీటిలో ఉంచిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో వేడి వేడి ఆహారం ఉంచడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. అవి మన శరీరంలోకి చేరి గట్ లైనింగ్‌ను నాశనం చేసి డీహైడ్రేటింగ్‌కు దారితీస్తాయి. పేగులను అనారోగ్యానికి గురి చేస్తాయి. గుండె జబ్బులు రావచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లో ఫుడ్ తినడం బెటర్.

News February 16, 2025

ఘజన్‌ఫర్ స్థానంలో ముంబైలోకి ముజీబ్

image

IPL: అఫ్గానిస్థాన్ ప్లేయర్ అల్లా ఘజన్‌ఫర్ స్థానంలో ముజీబ్‌ ఉర్ రహ్మాన్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు ఘజన్‌ఫర్ దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో రూ.4.8 కోట్లు వెచ్చించి ముంబై ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి MI స్పిన్నర్లు శాంట్నర్, ముజీబ్ ఎలా రాణిస్తారో చూడాలి.

News February 16, 2025

రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్‌ప్రెస్

image

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్‌లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.

error: Content is protected !!