News May 27, 2024
కేజ్రీవాల్ జైలుకు, రాహుల్ విదేశాలకు వెళ్తారు: అమిత్ షా

పంజాబ్ను కేజ్రీవాల్ అవినీతికి ATMగా మార్చారని అమిత్ షా ఆరోపించారు. కేజ్రీవాల్కు పంజాబ్ CM భగవంత్ మాన్ పైలట్గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్ నుంచే తీసుకెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్, AAP పంజాబ్ను డ్రగ్స్ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్ 4న మోదీ ప్రభుత్వం వస్తుందని, జూన్ 1న కేజ్రీవాల్ జైలుకు, 6న రాహుల్ విదేశాలకు వెళ్తారని లూథియానా ర్యాలీలో వ్యాఖ్యానించారు.
Similar News
News December 4, 2025
మామిడిలో జింకు లోపం – లక్షణాలు

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.
News December 4, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (<
News December 4, 2025
తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


