News May 11, 2024
నేడు మీడియాతో మాట్లాడనున్న కేజ్రీవాల్

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై నిన్న విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ ఆఫీస్కు చేరుకొని మీడియాతో మాట్లాడనున్నారు. తన అరెస్టును ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కాగా నిన్న కేజ్రీవాల్ విడుదల అనంతరం ఆయన భార్య సునీత ‘హనుమాన్ జీ కీ జై’ అంటూ ట్వీట్ చేశారు.
Similar News
News February 19, 2025
ఎవరీ రేఖా గుప్తా?

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా బినోయ్ సామాజిక వర్గానికి చెందిన నేత. విద్యార్థి దశ నుంచే ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1996-97 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పని చేశారు. సౌత్ ఢిల్లీ మేయర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) నుంచి 29595 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
News February 19, 2025
అదే మా పార్టీ ఆలోచన: KTR

తెలంగాణకు ఏనాటికైనా BRS పార్టీయే రక్షణ కవచం అని KTR అన్నారు. BRS విస్తృతస్థాయి సమావేశం అనంతరం మాట్లాడుతూ ‘KCR గారు ఒకటే మాట చెప్పారు. పార్టీలు ఓడిపోతుంటాయి. గెలుస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, తెలంగాణ సమాజం గెలవాలి. అదే మా ఆలోచన’ అని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఫైరయ్యారు.
News February 19, 2025
హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్

TG: 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. ఓపెనింగ్, క్లోజింగ్ సెర్మనీ, గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాల యువతులు అలరించనున్నారు. ఇందులో పాల్గొనే వారి వయసు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. విజేతకు వజ్రాల కిరీటం అందిస్తారు.