News January 22, 2025
వక్ఫ్ బిల్లుకు కేరళ కాంగ్రెస్ ఎంపీ జార్జ్ మద్దతు

మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు ‘INDIA’ సభ్యుడు, కేరళ కాంగ్రెస్ MP ఫ్రాన్సిస్ జార్జ్ మద్దతు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేంద్రం దీనిని పాస్ చేయాలన్నారు. నీతి, నిజాయతీకి తాను కట్టుబడతానని, వీటిని అనుసరించేవారికి తన పార్టీ సహకరిస్తుందని అన్నారు. మునంబమ్ భూమిని వక్ఫ్ లాగేసుకోవడంపై పోరాటం 100 రోజులకు చేరింది. దీనిపై క్రిస్టియన్ ట్రస్ట్ సర్వీస్ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
Similar News
News February 14, 2025
GBS బాధితులకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్

APలో 17 గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) వైరస్ కేసులు <<15225307>>వెలుగు చూశాయని<<>> వైద్యశాఖ వెల్లడించింది. గుంటూరు, విశాఖలో ఐదు చొప్పున, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కో కేసు బయటపడ్డాయని పేర్కొంది. బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 8వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.
News February 14, 2025
సహకార సంఘాల కాలపరిమితి పెంపు

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 904 సహకార సంఘాల కాలపరిమితి, 9 DCCB ఛైర్మన్ల పదవీకాలన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటితో గడువు ముగుస్తున్నా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది.
News February 14, 2025
వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఫోన్ సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టులో కోరారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోమవారం ఈ పిటిషన్ను కోర్టు విచారించనుంది.