News January 1, 2025

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

image

TG: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్‌ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. NCERT సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని సైన్స్‌తో పాటు ఇతర సబ్జెక్టుల్లో పాఠాలను కుదించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో, 2026-27 నుంచి సెకండియర్‌లో దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్‌లో 15%, జువాలజీలో 5-10% వరకు సిలబస్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 18, 2025

‘డాకు మహారాజ్’ కలెక్షన్లు @రూ.124+కోట్లు

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ చిత్రం కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ చిత్రానికి ఆరు రోజుల్లోనే రూ.124+కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్లాక్ బస్టర్.. కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేడు, రేపు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.

News January 18, 2025

ఈ నెలాఖరు నుంచి అల్లు అర్జున్ కొత్త మూవీ షురూ?

image

పుష్ప-2 హిట్‌‌తో జోష్ మీదున్న అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయనున్న మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. బన్నీ న్యూలుక్‌తో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేస్తారని టాక్. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారని తెలుస్తోంది. వీరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

News January 18, 2025

94 శాతం మందికి ‘ఆత్మీయ భరోసా’ కట్: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో 1.4 కోట్ల మంది ఉపాధి కూలీలుంటే 94 శాతం మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం చూస్తోందని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. దళితులు, గిరిజనుల, బీసీల నోళ్లు కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 20 రోజులు పనిచేసేవారికి అని నిబంధనలు పెట్టడం, గుంట భూమి ఉన్నా అనర్హులుగా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ మోసంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.