News January 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుల్లో ఒకరైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రతో కూడిన బెంచ్ ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే ట్రయల్ కోర్టు బెయిల్పై మరిన్ని షరతులు విధించాలని స్పష్టం చేసింది.
Similar News
News January 11, 2026
మైలురాళ్ల రంగుల గురించి తెలుసా?

*పసుపు: నేషనల్ హైవేలను సూచిస్తుంది. రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను NHAI మెయింటెన్ చేస్తుంది.
*గ్రీన్: ఇది స్టేట్ హైవేను సూచిస్తుంది. ఒక రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కనెక్ట్ చేస్తుంది.
*బ్లాక్: సిటీ, జిల్లా రోడ్లను సూచిస్తుంది. అర్బన్ సెంటర్లు, మున్సిపాలిటీలను కలుపుతుంది.
*ఆరెంజ్: గ్రామాల రోడ్లను సూచిస్తుంది. PMGSY స్కీమ్ ద్వారా వీటిని అభివృద్ధి చేస్తారు.
News January 11, 2026
ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.
News January 11, 2026
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. NZతో తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. సచిన్ 34,357 (782 ఇన్నింగ్సులు) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, కోహ్లీ 28,027* (624 ఇన్నింగ్సులు) రన్స్తో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత వేగంగా 28వేలకు పైగా రన్స్ (సచిన్ 644 ఇన్నింగ్సులు) చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచారు.


