News January 27, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

image

TG: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుల్లో ఒకరైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రతో కూడిన బెంచ్ ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని స్పష్టం చేసింది.

Similar News

News December 24, 2025

మొదటి ప్లమ్ కేక్ స్టోరీ: మంబల్లి బాపు మ్యాజిక్!

image

మన దేశంలో మొదటి ప్లమ్ కేక్ 1883లో కేరళలోని తలస్సేరిలో తయారైంది. మంబల్లి బాపు అనే బేకరీ యజమాని దీన్ని తయారు చేశారు. అప్పటి బ్రిటిష్ ఆఫీసర్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన కేక్ తిని దాన్ని మన దేశీ స్టైల్‌లో రీక్రియేట్ చేశారు. విదేశీ బ్రాందీకి బదులు స్థానిక జీడిమామిడి పండ్ల సారా, అరటిపండ్లు వాడి అద్భుతమైన రుచిని తెచ్చారు. ఇప్పటికీ అదే పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఈ కేకులను తయారు చేస్తున్నారు.

News December 24, 2025

పద్మ అవార్డులు పేర్ల ముందు, వెనుక ఉంచొద్దు: బాంబే హైకోర్టు

image

‘పద్మ’ అవార్డులను పేర్ల ముందు, వెనుక వినియోగించుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పద్మ అవార్డీ శరద్ హార్దికర్ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆయా రంగాల్లో చేసిన కృషి, సామాజిక సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డులు అందిస్తోందని, దీన్ని గౌరవంగా భావించాలే తప్ప టైటిల్‌గా కాదని స్పష్టం చేసింది. కాగా దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు.

News December 24, 2025

ఒంటరిగా గెలవలేకే ఉద్ధవ్ సోదరులు కలిశారు: మహా CM

image

రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న రేంజ్‌లో వారి కలయికను <<18657891>>ఉద్ధవ్ సోదరులు<<>> చూపుతున్నారని మహారాష్ట్ర CM ఫడణవీస్ ఎద్దేవా చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిన శివ్ సేన (UBT), మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన (MNS) కలయిక వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సిద్ధాంతాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే కలిశారని చెప్పారు. ఈ 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి గెలవలేవని తేలిపోయిందన్నారు.