News January 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుల్లో ఒకరైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రతో కూడిన బెంచ్ ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే ట్రయల్ కోర్టు బెయిల్పై మరిన్ని షరతులు విధించాలని స్పష్టం చేసింది.
Similar News
News December 18, 2025
ఎక్కువ వెల గొడ్డును, తక్కువ వెల గుడ్డను కొనరాదు

ఎక్కువ ధర పెట్టి పశువును కొన్నప్పుడు, అది అనుకోకుండా మరణిస్తే యజమానికి భారీ నష్టం వాటిల్లుతుంది. అలాగే మరీ తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని బట్టలు కొంటే అవి చిరిగిపోయి, రంగు వెలిసి, ముడుచుకుపోతాయి. అందుకే ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానితో ముడిపడి ఉన్న ప్రమాదం, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి. అనవసర ఆడంబరానికి పోయి ఎక్కువ వెల పెట్టకూడదు, అతి తక్కువ ధరకు ఆశపడి నాణ్యత లేని వస్తువును తీసుకోకూడదు.
News December 18, 2025
కాలసర్ప దోషం: గుర్తించే విధానమిదే..

కాలసర్ప దోషం తీవ్రమైన ప్రభావం చూపుతుందట. ఇది ఉన్న వ్యక్తికి 42 ఏళ్ల పాటు వైఫల్యాలు, మానసిక ఒత్తిడి, వృత్తిలో అభివృద్ధి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయట. ఈ దోషాన్ని గుర్తించడానికి సూచనలు కలలు అని పండితులు చెబుతున్నారు. కలలో పాములు కనిపించడం తీవ్రమైన కాలసర్ప దోషానికి సంకేతాలుగా భావిస్తారట. ఇలాంటి కలలు వస్తే వెంటనే శివుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వంటి నివారణలు పాటించాలని సూచిస్తున్నారు.
News December 18, 2025
ఈరోజు చివరి అవకాశం!

మార్గశిర మాసంలో గురువార వ్రతం ఆచరిస్తారు. అయితే ఈ నెలలో ఇదే చివరి గురువారం. ఈ వ్రతంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతారు. సంపద, సంతోషం, శ్రేయస్సు ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ వ్రతం చేస్తారు. ఇది మార్గశిరంలో ఏ ఒక్క గురువారం చేసినా సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం వలన మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజును వినియోగించుకోండి.


