News December 21, 2024

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. మొబైల్ యాప్‌లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరునే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

Similar News

News January 14, 2025

‘ప్లేయర్ ఆఫ్ ది డిసెంబర్’గా బుమ్రా

image

BGTలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన స్టార్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించారు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్‌లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.

News January 14, 2025

లండన్‌ పర్యటనకు బయలుదేరిన జగన్‌

image

మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్‌ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్‌, ఫైనాన్స్‌ కోర్సులో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్‌ లండన్‌ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

News January 14, 2025

మరికాసేపట్లో మకరజ్యోతి

image

మరికాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించేందుకు అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీగా శబరిమలకు చేరుకున్నారు. భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.