News May 10, 2024
DBTలపై హైకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మే 13న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు వంటి పథకాల అర్హులకు అందాల్సిన నగదు ఆలస్యం కానుంది.
Similar News
News February 6, 2026
వైభవ్ ఓ అద్భుతం: అశ్విన్

U19 WC ఫైనల్లో 175 <<19067167>>పరుగులు చేసిన<<>> వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ‘15 సిక్సులు, 15 ఫోర్లు బాదడం అసాధారణం. ఇందుకోసమే పుట్టాడా అన్నట్లుగా ఆ వేదికను తన సొంతం చేసుకున్నాడు. అతడో అద్భుతం. ఈ పిల్లాడు అంతర్జాతీయ క్రికెట్ తలుపులను వేగంగా, గట్టిగా తడుతున్నాడు. T20 WC తర్వాత ఆ తలుపులు తెరుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని ట్వీట్ చేశారు.
News February 6, 2026
నెహ్రూలా మోదీ చేయలేదు: నిర్మలా సీతారామన్

ఆర్మీ మాజీ చీఫ్ నరవణెతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయన్ను తాము గౌరవిస్తామని చెప్పారు. నరవణె <<19052501>>పుస్తకాన్ని<<>> నిషేధించలేదని, రక్షణ శాఖ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు. ‘‘మీకు కరెక్ట్ అనిపించింది చేయండని సాయుధ దళాలకు మోదీ స్వేచ్ఛనిచ్చారు. ‘అరుణాచలీస్.. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’ అని నెహ్రూ చెప్పినట్లుగా ప్రధాని చేయలేదు’’ అని విమర్శించారు.
News February 6, 2026
తెలంగాణలో 336 వార్డుల్లో జనసేన పోటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ADB, నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొంది. ఇప్పటికే B-ఫారమ్స్ దాఖలు చేయగా, రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారని తెలిపింది. వీరంతా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు వివరించింది.


