News May 10, 2024

DBTలపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మే 13న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు వంటి పథకాల అర్హులకు అందాల్సిన నగదు ఆలస్యం కానుంది.

Similar News

News December 16, 2025

విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

image

సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.

News December 16, 2025

TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>TRAI<<>>) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు JAN 4వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ Eng., CS&IT, DS& AI) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023, 2024, 2025లో అర్హత సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 16, 2025

శనగలో ఇనుము లోప లక్షణాలు – నివారణ

image

సాధారణంగా సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి, ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో నాటిన శనగ పంటలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల లేత ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండి రాలిపోతాయి. నేలలకు ఫెర్రస్ సల్ఫేట్ నేరుగా అందించడం అంత లాభదాయకం కాదు. కాబట్టి ప్రతి లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా, ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాతో రెండు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.