News May 25, 2024
ఖరీఫ్ పంట ఉత్పత్తి లక్ష్యం 167 లక్షల టన్నులు

AP: ఈ ఏడాది ఖరీఫ్లో 81.65 లక్షల ఎకరాల్లో 24 రకాల పంటల సాగు లక్ష్యంతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 167.15 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అంచనా వేసింది. ఇప్పటికే 5.49 లక్షల క్వింటాళ్ల వరి, చిరుధాన్యాలు, అపరాలు, నువ్వులు, వేరుశనగ విత్తనాలను రాయితీతో ఆర్బీకేల ద్వారా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే 17.50 లక్షల టన్నుల ఎరువులను రెడీగా ఉంచింది.
Similar News
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.
News December 2, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా?
News December 2, 2025
హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!


