News April 12, 2024

గతనెల పిల్లల్ని చంపి.. ఇప్పుడు దంపతుల ఆత్మహత్య

image

TG: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. గతనెల ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లిదండ్రులు ఇవాళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంకన్నగూడెంకు చెందిన అనిల్, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కుటుంబ కలహాలతో వారు గతనెల పిల్లలిద్దరికీ పురుగుమందు తాగించి హత్య చేసి పరారయ్యారు. ఇప్పుడు స్థానిక అడవిలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 23, 2025

27న పోలవరానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

News March 23, 2025

కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

image

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.

News March 23, 2025

ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ

image

AP: చంద్రబాబు 40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని YCP విమర్శించింది. ఎన్నికల్లో కపట హామీలు ఇచ్చి గెలిచాక వాటి ఊసే ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. వాలంటీర్లు, ఏపీ అప్పు, సూపర్ 6, భృతి, ఉచిత బస్సు, పోలవరం విషయంలో మోసం చేశారని ఆరోపించింది. ఇప్పటికే మండలిలో ప్రభుత్వాన్ని YCP ప్రశ్నిస్తోందని, శాసనసభలోనూ ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత నిలదీస్తారని CBN భయపడుతున్నారని పేర్కొంది.

error: Content is protected !!