News May 10, 2024

వ్యాపారంలోనూ ‘కింగ్’ కోహ్లీనే!

image

స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కెరీర్‌తో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. 2020లో ‘గో డిజిట్’ అనే ఇన్సూరెన్స్ స్టార్టప్‌లో ఈ జంట రూ.2.5కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈనెల 15-17 తేదీల్లో ఆ సంస్థ IPO అందుబాటులోకి రానుంది. ఒక్కో షేర్ ధర రూ.258-272 మధ్య ఉండటంతో వీరి సంపద రూ.9.06 కోట్లకు (రూ.6.56కోట్ల లాభం) చేరనుంది. కాగా కోహ్లీ 2,66,667 షేర్లు, అనుష్క 66,667 షేర్లు కొనుగోలు చేశారు.

Similar News

News February 16, 2025

కొత్త హీరోయిన్‌తో లవ్‌లో పడ్డ రామ్ పోతినేని?

image

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన RAPO22తో బిజీగా ఉండగా ఆ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. లవ్ స్టోరీలో నటిస్తూ ఈ బ్యూటీతో ప్రేమలో పడిపోయాడని పేర్కొన్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలోనూ హీరోయిన్ అనుపమతో రామ్ ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News February 16, 2025

సంచలనం: ఇండియా ఎన్నికల్లో అమెరికా జోక్యం!

image

అమెరికాలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని DOGE శాఖ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం 21 మిలియన్ డాలర్ల ట్యాక్స్ పేయర్ల డబ్బును వెచ్చించాలని ప్రతిపాదించింది. దీంతో పాటు ఇతర దేశాలకూ ప్రపోజ్ చేసిన నిధులను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. అయితే మన దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యం బయటపడటంతో దీనిపై మోదీ సర్కార్ విచారణ జరిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News February 16, 2025

నేషనల్ అవార్డ్ కోసం వెయిటింగ్: సాయిపల్లవి

image

నేషనల్ అవార్డ్ అందుకోవాలని తనకు ఎంతో ఆశగా ఉందని హీరోయిన్ సాయిపల్లవి అన్నారు. దానిని అందుకున్న రోజే తన నాయనమ్మ ఇచ్చిన చీర కట్టుకుంటానని చెప్పారు. ‘నాకు 21 ఏళ్లున్నప్పుడు మా నానమ్మ ఓ చీర ఇచ్చింది. దానిని ఏదైనా అవార్డుల ప్రదానోత్సవానికి కట్టుకోవాలని అనుకున్నా. అందుకే జాతీయ అవార్డు వస్తే దానిని ధరిస్తా’ అని చెప్పుకొచ్చారు. కాగా ‘గార్గి’ మూవీకిగాను సాయిపల్లవికి జాతీయ అవార్డ్ వస్తుందని అందరూ భావించారు.

error: Content is protected !!