News October 25, 2024
భారీ ఆధిక్యం దిశగా కివీస్
పుణే వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. దీంతో 301 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ లాథమ్ 86 రన్స్తో రాణించారు. క్రీజులో బ్లండెల్(30), ఫిలిప్స్(9) ఉన్నారు. సుందర్ 4, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 రన్స్కు ఆలౌటైంది.
Similar News
News October 25, 2024
ALERT: వీరికే ఉచిత సిలిండర్
AP: రాష్ట్రంలో ఉచిత సిలిండర్కు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుండగా దీపావళి సందర్భంగా 31న తొలి ఉచిత సిలిండర్ డెలివరీ చేస్తామని తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకు ఒకటి చొప్పున మొత్తం 3 సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
News October 25, 2024
2024 US elections: ఎలక్టోరల్ ఓట్ల గురించి (2/3)
50 Statesలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు 435 ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి 2 ఎలక్టోరల్ ఓట్లు సెనెట్ ద్వారా వస్తాయి. తద్వారా మొత్తం 535 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీకి 3 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి (Winner-take-all). వీరు డిసెంబర్లో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జనవరిలో కాంగ్రెస్ ధ్రువీకరిస్తుంది.
News October 25, 2024
2024 US elections: ఎంత బలం అవసరం?(1/3)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ అయినప్పటికీ, నేరుగా ప్రజలు అధ్యక్షుడిని ఎన్నుకోరు. వారు తమ సొంత రాష్ట్రంలో ఎలక్టర్లకు ఓటు వేస్తారు. ఈ ఎలక్టర్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అభ్యర్థికి గెలవడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ప్రతి రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రజలు వీరికి ఓటేస్తారు.